May 26, 2013

లక్ష్మి నరసింహస్వామి జయంతి..


ఉగ్రవీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మ్రుత్యు మ్రుత్యుం నమామ్యహం




తిధి: వైశాఖ బహుళ త్రయోదశి..

భగవంతుడు మానవుడిగ మారడానికి ఏన్నో ఆవతారలను ఎత్తల్సివచ్చింది. మొదటగా మత్స్యవతారం, తరువాత కూర్మవతారం ఆ తరువాత నరసింహావతారం.ఈ నరసింహవతారం సగం నరుడు మిగిలిన సగం సింహాం రూపం. 

ఆవతార రహస్యం: హిరణ్యకసిపుడు(రాక్షసుడు) బ్రహ్మకై తప్పసు చేసి , తన మరణం మనిషి వలన కాని, జంతువు వలన కాని, మరేవిధమైన జీవి వలన కాని, పగలు కాని, రాత్రి కాని, ఇంట్లో కాని, బయట కాని, ఆకాశంలో కాని నేలమీద కాని, చేతితో కాని లేక మరేవిధమైన ఆయుధంతో కాని మరణం సంభవించకుడదని వరం కోరుకున్నాడు.

ఆ వరాన్ని అనుసరించి, నరసి హవతారం జరిగింది.
హిరణ్యకసిపుడు కోరుకున్నట్లు, శ్రీహరి మనిషి కాదు, మృగం కాదు, రేండు కలిసిన అవతారం. మరణం సంభవించింది పగలు కాదు రాత్రి కాదు, మధ్యహ్నం. ఇంట్లొ కాదు బయట కాదు, ఇంటి గుమ్మం మీద కుర్చోని, ఆకశంలో కాదు, నేలపై కాదు, తన కాలి తోడపై పెట్టుకోని, ఏ ఆయుధం ఉపయోగించాకుండ తన చేతి గోర్లతో, హిరణ్యకసిపుడి పోట్ట చిల్చి, పేగులు తీసి చంపాడు.

నరసింహస్వామి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చెది ప్రహ్లదుడు..

భక్త ప్రహ్లద:
బాల భక్తుడు అంటే ఎవరికైన మొదటగా గుర్తుకువచ్చేది ప్రహ్లదుడే. ఒక రాక్షసుడు (హిరణ్యకసిపుడు) కూమరుడైనప్పటికి, శ్రీహరిపై తన భక్తిని, విశ్వాసాన్ని వదలక ఏన్నో కష్టలకోర్చి, శ్రీహరిని మరోసారి భక్తసులభుడని నిరూపించాడు.


నీ హరి యెక్కడున్నాడని గద్దించిన హిరణ్య కశిపునకు భక్తప్రహ్లాదుదిచ్చిన సమాధానము……

ఇందు గలడందు లేడను
సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
డెందెందు వెదెకి చూసిన
అందందే కలడు దానవాగ్రణి కంటే!

May 5, 2013

బిల్వష్టకం

బిల్వష్టకం




త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం

త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (1)


త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః

తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. (2)


కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః

కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. (3)


కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం

ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. (4)


ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః

నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. (5)


రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా

తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. (6)


అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం

కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. (7)


ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ

భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. (8)


సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః

యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం. (9)


దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ

కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. (10)


బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం

అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (11)


సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే

అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. (12)


అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా

అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం. (13)


బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ

శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.

May 4, 2013

చైత్ర బహుళ పంచమి-- మత్స్యావతార జయంతి



          ఒకనోక్క కాలంలో బ్రహ్మా నిద్రిస్తుండగా, సోమకసురుడనే రాక్షసుడు వేదలను ఆపహరించి వాటిని నాశనం చేయలనుకున్నాడు. ఏందుకంటే సృష్టి ధర్మలకు మూలం ఆ వేదలే. అలాంటి వేదలను నాశనం చేస్తే సృష్టిలో ఆరాచకం ప్రభలుతుందని వారి నమ్మకం. ఆ నాడు 
శ్రీ మహావిష్ణువు మత్స్యావతరంలో వచ్చి ఆ రాక్షసుని అంతమోందించి వేదలను రక్షించాడు. 

మరి ఈ నాడు, మనమే మన వేదలను, అందులోని ధర్మలను తెలిసి తేలియని ఆజ్ఙానంతో నాశనం చేస్తుంటే కాపాడే ఆ మహానీయుడు ఏప్పుడు వస్తాడో అని ఎదురుచూడటం, త్వరగా రావాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయగలం…..


శివ ఋగ్వేద మంత్రం


కర్పూర గౌరం కరుణావతరం !
సంసార సారం భుజగేంద్ర హరం !!
సదా వసంతం హృదయరవిందే !
భవం భవాని సహితం నమామి !!


కర్పూర గౌరం  : కర్పూరం అంత స్వచ్ఛమైనవాడ..
కరుణావతరం   : కరుణాతో కూడిన వాడ / ధయస్వరూప..
సంసార సారం  : ఈ విశ్వం యొక్క భావము / తత్వము నీవు
భుజగేంద్ర హరం : ఫణి రాజుని కంఠభరణంగా ధరించినవాడ
సదా వసంతం  : ఏల్లప్పుడు చల్లగా కపాడువాడ.. 
హృదయరవిందే : పధ్మములాంటి హృదయము గలవాడ..  
భవం భవాని  : ఓ పార్వతి, పరమేశ్వరులార...
సహితం నమామి: మీకు శిరస్సువంచి పాదభివందనం చేస్తున్నాం..

Apr 26, 2013

పెళ్ళికి వచ్చే దేవతలు


పెళ్ళికి వచ్చే దేవతలు


   
 
             

                          పెళ్ళిలో ప్రధమంగా గణపతి పూజ ప్రారంభమౌతుంది కాబట్టి వినాయకుడు ఆ పెళ్ళి మంటపానికి మొదటగా వస్తాడు. ఆయన తన పూజనందుకొని నిత్యవరుడై నిత్యకళ్యణాన్ని పచ్చతోరణంతో జరుపుకొనే శ్రీ మహావిష్ణువుని ఆయన భార్య శ్రీ మహాలక్ష్మిదేవితో సహా వేదికవద్దకి పంపించి మరీ వెళ్తాడు గణపతి. ఆ మహావిష్ణువే సతీసమేతంగా మన పెళ్ళి వేదిక మీద కలశంలో సర్వ వివాహ ధర్మాన్ని గమనిస్తూ వుంటాడు. శ్రీ మహావిష్ణువు సతీసమేతంగా వస్తూన్నాడనే సమాచారాన్ని ముందుగా గరుడుడు దేవతలందరికీ తెలియజేస్తాడు. దాంతో శ్రీ మహావిష్ణువుకి స్వాగతం పలికేందుకు విష్ణువు రాకకి ముందే పెళ్ళివేదిక వద్దకు అష్టదిక్పాలకులూ - అంటే ఎనిమిది దిక్కుల్నీ పరిపాలించే ఇంద్రుడు (తూర్పు), అగ్ని (ఆగ్నేయం), యముడు (దక్షిణం), నిరృతి (నైఋతి), వరుణుడు (పశ్చిమం), వాయువు (వాయువ్యం), కుబేరుడు (ఉత్తరం), ఈశానుడు (ఈశాన్యం) వీరందరూ వివాహవేదిక వద్దకు చేరుకుంటారు. వీరితోపాటు వీరి దాసులు, దాసానుదాసులు, భక్తులు, వైకుంఠ కైలాస నివాసులు అంతా అక్కడికి రానేవస్తారు. వారు వారి ధర్మపత్ని సమేతంగా అనగా వశిష్ఠ-అత్రి - భరద్వాజ- విశ్వామిత్ర- గౌతమ-కశ్యప-జమదగ్ని మొదలగు సప్తమహర్షులు వచ్చి ఆ నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. శాస్తోక్తమైన మంత్ర పూరక వివాహనికి నిస్వార్ధంగా ఇందరు దేవతలూ, ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారంటే వివాహన్ని మంత్ర పూర్వకంగా వద్దంటే మనము ఎంతో కోల్పోయినట్లే కదా!!!   
    

Apr 5, 2013

*** అష్టాదశ పురాణాలు ***





     శ్లో" మద్వయం భద్వయం చైవ, 
     బ్రత్రయం వచతుష్టయం
     అనాపలింగ కూస్కాని,
     పురాణాని ప్రచక్షత" 


1. మత్స్య పురాణం
2. మార్కండేయ పురాణం  
3. భాగవత పురాణం
4. భవిష్య పురాణం
5. బ్రహ్మ పురాణం
6. బ్రహ్మండ పురాణం
7. బ్రహ్మవైవర్త పురాణం
8. వరాహ పురాణం
9. వామన పురాణం 
10. వాయు పురాణం
11. విష్ణు పురాణం
12. అగ్ని పురాణం
13. నారద పురాణం
14. స్కంద పురాణం
15. లింగ పురాణం
16. గరుడ పురాణం
17. కూర్మ పురాణం
18. పద్మ పురాణం


Apr 2, 2013

*** దివి నుండి భువికి దిగి వచ్చిన గంగా ***





.

                                             *** భగీరధ ప్రయత్నం ***

                  భగీరధుని ప్రయత్నం వలన గంగానది భువికి దిగి వచ్చింది..

     గంగానది ని ఆకాశం నుండి నేలపైకి రప్పించడానికి భగీరధుడు చేసిన ప్రయత్నం సామాన్యం కాదు...

  • మొదట గంగా దేవిని భూమి మీదకు రమ్మని ప్రార్ధించాడు .. 
  • గంగానది ప్రవాహన్ని భూదేవి తట్టుకోలేదని దానికి సహకరించమన్ని మహదేవుని ప్రార్ధించాడు...
  • అంతులేని తన వేగంతో మహదేవుని శిరస్సుపైకి దూకిన గంగాదేవిని శివుడు తన జట్టజుట్టాల లో బందించాడు...
  • శివుని కోపం తగ్గించి గంగాను విడిపించేందుకు మళ్ళీ శివున్ని ప్రార్ధించాడు..
  • భగీరధుని వేంట వెళ్తున్న గంగా, తన ప్రవాహంలో జమతాగ్ని మునీ ఆశ్రమం కోట్టుకుపోతే ఆ మునీ కోపంతో గంగానదిని మొత్తం మింగేశాడు..
  • భగీరధుడు, గంగానది కోసం మళ్ళీ ఆ మునీని ప్రార్ధించగా... జమతాగ్ని మునీ తన చేవుల నుండి గంగాను విడిచి పేట్టడు..
  • ఆ తరువాత గంగానది పవిత్రత వలన భగీరధుని పూర్వికుల పాపాలు తోలగి స్వర్గలోకాన్నికి చేరుకున్నారు..