Showing posts with label stories. Show all posts
Showing posts with label stories. Show all posts

Feb 10, 2014

Fasting

ఉపవాస కాలము


ఉపవాసమంటే ఏమీ తీసుకోకపోవటము. అఖరికి ఉమ్మి కూడా మింగకపోవటము.
ఉపవాసమంటే, భగవంతుడ్ని సదా స్మరిస్తూ, ఆయన ధ్యాసలోనే ఉండాల్సిన సమయం.
ఉపవాసం వల్ల శరీరంలో మలినాలెన్నో పోతాయి. ఉపవాసంలో భగవంతుడితో పాటు, మన శరీరాన్ని పూజించటము. పురానశాస్త్రాల్లో పొరపాట్లు చేసిన వారు ఉపవాసాలు చెయ్యలని ఉంది. అలాగే ఉపవాసాలు బొధువులూ, స్నేహితులూ వంటి వారు రాని రోజులో చేయాలి.

Feb 7, 2014

Why should we wear Rings at the time of Engagement??


నిశ్చితార్ధంలో వధువు, వరుడు ఒకరివేలికి మరోకరు ఉంగరం తోడిగేదెందుకు?



  తాంబులాలు మర్చుకోనేటప్పుడు, వధువరుల వేలికి ఉంగరాలు మర్చుకుంటారు. ఈ ఉంగరాల్ని ఉంగరం వేలికి తొడగటంలో ఒక విషయం దాగి ఉంది. ఉంగరం వేలి నరానికి హృదయానికి అవినాభావ సంబంధం ఉంది. నా మనసనే నా ఈ ఉంగరాన్ని నీ వేలికి తోడుగుతున్నాను.ఉంగరం వేలికి పెట్టిన ఉంగరం ఎలా ఉంటుందో అలానే నేను నా హృదయంలో నిన్ను పెట్టుకూంటాను అని అర్ధం.

Jan 29, 2014

మాస శివరాత్రి (masa sivaratri)

                ప్రతి నెల పౌర్ణమి తర్వత 13 వ రోజు అంటే శుక్ల పక్షం లో వచ్చే చతుర్ధశి (బహుళ చతుర్ధశి)తిథి  ని మాస శివరాత్రి అని పిలుస్తారు.అమావాస్య కు 1 లేక 2 రోజుల ముందు వస్తుంది మాస శివరాత్రి.  మాఘ మాసం లో వచ్చే ఈ తిథి ని మహాశివరాత్రి అంటారు.
ఈ రోజు శివునికి అభిషేకం, శివపార్వతుల దర్శనం శ్రేయష్కరం.

Jun 1, 2013

కాళిక ఆవతార రహాస్యం

     

 


పూర్వం రక్తబీజ అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడికి ఒక్క వరం ఉంది. తన రక్తం నేలమీద పడిన వేంటనే ఇంకో రాక్షసుడు తన రూపంలోనే పుడతాడు. కాని రక్తం నేలమీద పడకుండా రాక్షసుని చంపడం కుదరని పని. అందుకే దుర్గ మాత కాళికదేవి రూపం ధరించింది. ఆ రూపంలో కాళికదేవి రక్తబీజున్ని సంహరిస్తు అతడి రక్తన్ని తాను సేవించేది. అలా ఆ రాక్షసుని సంహరించింది. కాని కాళికమాత రక్త దాహం ఇంకా తిరకపోవడంతో తనకు నమస్కారించ వచ్చిన దేవతలను కాడా సంహరించబోయింది. అలా తాను రక్తం కోసం వేదుకుతున్న సమయంలో తనకు ఏవరు ఎదురుపడిన, ఎదుట ఉన్న వారు ఎవరో ఎంటో అనే ఆలోచన లేకుండా సంహరిస్తుందని... తనకు ఆలోచన జ్ఞానం వచ్చేల చేయడానికి, పరమేశ్వరుడు కాళిక మాత నడిచి వచ్చే దారిలో నేలపై పడి ఉంటాడు. మాత కోపంతో భయంకరమైన అరుపులతో నృత్యం చేస్తు వచ్చి శివుని పై తన పాదం మోపుతుంది. తన పాదంకింద ఎవరున్నారు అని చూసేంతలోనే తనకి ఆలోచన జ్ఞానం వచ్చి తాను కాళిక ఆవతారన్ని విడిచి మరల ఆదిశక్తి రూపన్ని ధరిస్తుంది. 

కాళిక ఆవతారం:

కాళిక అంటే నల్లనిది అని అర్దం. చీకటి లో చేసే తంత్ర విధ్యలకు ఆమే అధినేత. మనం ఏ దేవత పేరు చేప్పి కోళ్ళాను, మేకల్ని బలి ఇచ్చిన వాటిని స్వీకరించేది కాళిక దేవి మాత్రమే. అమే మంచి చేడు అని ఏం చూడదు. తనను శరణు జోచ్చిన వారిని, తనకు ప్రితికరంగా నైవెద్యం సమర్పించిన వారికి, తాన పూజను భక్తి శ్రద్దలతో చేసిన వారికి ఏం కావాలన్న ఇస్తుంది. అందుకే మంత్రం, తంత్రం తేలిసిన, నేర్చుకోవాలన్న అందరు తాననే ఆశ్రయిస్తారు.. 
పూర్వం రాజులు తమ శత్రువులను జయించాటనికి కాళిక పూజనే చేసేవారు. మాత ఆశిస్సు పోందటానికి తమ శిరస్సున్ని తామే ఖండించుకునేవారు కూడా. దీనికి చక్కటి ఉదాహరణ బట్టీ విక్రమాదిత్యుని కధే...

May 26, 2013

వరాహ లక్ష్మీ నృసింహ స్వామి




ఈ నెల 13-05-2013 వ తేదీన సింహాచలమున వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి నిజరూప దర్శనం లభిస్తుంది. దీనినే మనం అక్షయ తృతీయ(చందనయాత్ర) అంటాము. వైశాఖ బహుళ తదియ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది.

సింహాచలంలో భగవానుడు మనకు సంవత్సరము అంతా గుమ్మడిపండు రూపంలో దర్సనమిస్తాడు. విదియనాటి రాత్రి స్వామి కి అభిషేకాదులు చేసి అర్చకులు.... స్వామి మేను నుండి చందనము తొలగిస్తారు. తిరిగి తదియనాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధార నుండి మట్టి కలశలతో నీరు తెచ్చి అప్పన్నకి సహస్ర కలశాభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం జరుగుటకు మన పెద్దలు చెప్పిన కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాము.

హిరాణ్యాక్షుని సంహరించిన పిదప, నరసింహస్వామి ప్రహ్లాదునుని, నీకేమివరము కావాలో కోరుకో అని అడుగగా..... అంతట ప్రహ్లాదుడు స్వామితో ఇట్లనెను "స్వామీ మా తండ్రి, పెడతండ్రులను సంహరించిన వాడివైనందున నీ రెండు అవతారాలను కలిపి ఒకే రూపంలో దర్శించే భాగ్యము నాకు కల్పించు తండ్రీ" అని అడగగా స్వామి అట్లే అనుగ్రహించి, ప్రహ్లాదుని కోరికని మన్నించెను. అందువలననే ఇచట వెలసిన స్వామిని "శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి" అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి రూపం మనకు మరెక్కడా కనిపించదు.

ప్రహ్లాద వంశీయుడైన పురూరవ చక్రవర్తి, ఊర్వశితో గగనమార్గాన విహరిస్తున్న సమయంలో సింహగిరి సమీపమునకు రాగానే వారి పుష్పకవిమానము ముందుకు కదలక అచ్చటే నిలిచిపోయేనట. ఆ చక్రవర్తి భగవదాజ్ఞగా భావించి, కొంత సమయము విశ్రాంతి తీసుకోదలచి వాహనమును సింహగిరి పైకి దించి, ఒక చెట్టు క్రింద విస్రమించెను. అంతట అతనికి స్వప్నమందు అప్పన్న సాక్షాత్కరించి, "నేను ఇచటనే వెలసియున్నను, నాకు ఆరాధన చేయు" అని పలికెను. వెంటనే పురూరవుడు.....స్వామి చెప్పిన గురుతుల ప్రకారము, ఆ కొండ ప్రాంతమంతా భటులచే వెతికించి, ఒక చోట స్వామి ఉన్నట్లు తెలుసుకొని, స్వామి పై ఉన్న పుట్టమన్నుని తొలగించి దర్శించెనట. అంత స్వామి ఇంతకాలము తనపై ఉన్నమట్టివలన తాపములేదని, ఎంత మన్నుని తనపైనుండి తీసారో అంతే పరిమాణంలో తనపై శ్రీ చందనం పూతగా వేయవలెనని చెప్పెనట, సంవత్సరములో ఈ ఒక్కరోజునే స్వామి యొక్క నిజరూప దర్శనభాగ్యం మనకు లభిస్తోంది. పుట్టను తవ్వి తీసిన మట్టి 12 మణుగులు ఉన్న కారణంగా, ఇప్పుడు అంతే పరిమాణంగల చందనమును 4 విడతలుగా వేస్తున్నారు. ఆ నాలుగు విడతలు----1) అక్షయ తృతీయ నాడు, 2) వైశాఖ పూర్ణమి నాడు, 3) జ్యేష్ట పూర్ణిమ & ఆషాడపూర్ణిమ. ప్రతీ విడతకు 3 మణుగుల చొప్పున చందనమును స్వామిపై వేస్తారు. అందుకే ఈ స్వామిని చందన స్వామి అనికూడా అంటారు.

చందనయాత్ర రోజున నాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధారవద్ద స్నానమాచరించి మట్టికలశలతో గంగధార నీటిని తీసుకొని వచ్చి స్వామికి అభిషేకిస్తారు.

లక్ష్మి నరసింహస్వామి జయంతి..


ఉగ్రవీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మ్రుత్యు మ్రుత్యుం నమామ్యహం




తిధి: వైశాఖ బహుళ త్రయోదశి..

భగవంతుడు మానవుడిగ మారడానికి ఏన్నో ఆవతారలను ఎత్తల్సివచ్చింది. మొదటగా మత్స్యవతారం, తరువాత కూర్మవతారం ఆ తరువాత నరసింహావతారం.ఈ నరసింహవతారం సగం నరుడు మిగిలిన సగం సింహాం రూపం. 

ఆవతార రహస్యం: హిరణ్యకసిపుడు(రాక్షసుడు) బ్రహ్మకై తప్పసు చేసి , తన మరణం మనిషి వలన కాని, జంతువు వలన కాని, మరేవిధమైన జీవి వలన కాని, పగలు కాని, రాత్రి కాని, ఇంట్లో కాని, బయట కాని, ఆకాశంలో కాని నేలమీద కాని, చేతితో కాని లేక మరేవిధమైన ఆయుధంతో కాని మరణం సంభవించకుడదని వరం కోరుకున్నాడు.

ఆ వరాన్ని అనుసరించి, నరసి హవతారం జరిగింది.
హిరణ్యకసిపుడు కోరుకున్నట్లు, శ్రీహరి మనిషి కాదు, మృగం కాదు, రేండు కలిసిన అవతారం. మరణం సంభవించింది పగలు కాదు రాత్రి కాదు, మధ్యహ్నం. ఇంట్లొ కాదు బయట కాదు, ఇంటి గుమ్మం మీద కుర్చోని, ఆకశంలో కాదు, నేలపై కాదు, తన కాలి తోడపై పెట్టుకోని, ఏ ఆయుధం ఉపయోగించాకుండ తన చేతి గోర్లతో, హిరణ్యకసిపుడి పోట్ట చిల్చి, పేగులు తీసి చంపాడు.

నరసింహస్వామి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చెది ప్రహ్లదుడు..

భక్త ప్రహ్లద:
బాల భక్తుడు అంటే ఎవరికైన మొదటగా గుర్తుకువచ్చేది ప్రహ్లదుడే. ఒక రాక్షసుడు (హిరణ్యకసిపుడు) కూమరుడైనప్పటికి, శ్రీహరిపై తన భక్తిని, విశ్వాసాన్ని వదలక ఏన్నో కష్టలకోర్చి, శ్రీహరిని మరోసారి భక్తసులభుడని నిరూపించాడు.


నీ హరి యెక్కడున్నాడని గద్దించిన హిరణ్య కశిపునకు భక్తప్రహ్లాదుదిచ్చిన సమాధానము……

ఇందు గలడందు లేడను
సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
డెందెందు వెదెకి చూసిన
అందందే కలడు దానవాగ్రణి కంటే!

May 4, 2013

చైత్ర బహుళ పంచమి-- మత్స్యావతార జయంతి



          ఒకనోక్క కాలంలో బ్రహ్మా నిద్రిస్తుండగా, సోమకసురుడనే రాక్షసుడు వేదలను ఆపహరించి వాటిని నాశనం చేయలనుకున్నాడు. ఏందుకంటే సృష్టి ధర్మలకు మూలం ఆ వేదలే. అలాంటి వేదలను నాశనం చేస్తే సృష్టిలో ఆరాచకం ప్రభలుతుందని వారి నమ్మకం. ఆ నాడు 
శ్రీ మహావిష్ణువు మత్స్యావతరంలో వచ్చి ఆ రాక్షసుని అంతమోందించి వేదలను రక్షించాడు. 

మరి ఈ నాడు, మనమే మన వేదలను, అందులోని ధర్మలను తెలిసి తేలియని ఆజ్ఙానంతో నాశనం చేస్తుంటే కాపాడే ఆ మహానీయుడు ఏప్పుడు వస్తాడో అని ఎదురుచూడటం, త్వరగా రావాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయగలం…..


Apr 26, 2013

పెళ్ళికి వచ్చే దేవతలు


పెళ్ళికి వచ్చే దేవతలు


   
 
             

                          పెళ్ళిలో ప్రధమంగా గణపతి పూజ ప్రారంభమౌతుంది కాబట్టి వినాయకుడు ఆ పెళ్ళి మంటపానికి మొదటగా వస్తాడు. ఆయన తన పూజనందుకొని నిత్యవరుడై నిత్యకళ్యణాన్ని పచ్చతోరణంతో జరుపుకొనే శ్రీ మహావిష్ణువుని ఆయన భార్య శ్రీ మహాలక్ష్మిదేవితో సహా వేదికవద్దకి పంపించి మరీ వెళ్తాడు గణపతి. ఆ మహావిష్ణువే సతీసమేతంగా మన పెళ్ళి వేదిక మీద కలశంలో సర్వ వివాహ ధర్మాన్ని గమనిస్తూ వుంటాడు. శ్రీ మహావిష్ణువు సతీసమేతంగా వస్తూన్నాడనే సమాచారాన్ని ముందుగా గరుడుడు దేవతలందరికీ తెలియజేస్తాడు. దాంతో శ్రీ మహావిష్ణువుకి స్వాగతం పలికేందుకు విష్ణువు రాకకి ముందే పెళ్ళివేదిక వద్దకు అష్టదిక్పాలకులూ - అంటే ఎనిమిది దిక్కుల్నీ పరిపాలించే ఇంద్రుడు (తూర్పు), అగ్ని (ఆగ్నేయం), యముడు (దక్షిణం), నిరృతి (నైఋతి), వరుణుడు (పశ్చిమం), వాయువు (వాయువ్యం), కుబేరుడు (ఉత్తరం), ఈశానుడు (ఈశాన్యం) వీరందరూ వివాహవేదిక వద్దకు చేరుకుంటారు. వీరితోపాటు వీరి దాసులు, దాసానుదాసులు, భక్తులు, వైకుంఠ కైలాస నివాసులు అంతా అక్కడికి రానేవస్తారు. వారు వారి ధర్మపత్ని సమేతంగా అనగా వశిష్ఠ-అత్రి - భరద్వాజ- విశ్వామిత్ర- గౌతమ-కశ్యప-జమదగ్ని మొదలగు సప్తమహర్షులు వచ్చి ఆ నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. శాస్తోక్తమైన మంత్ర పూరక వివాహనికి నిస్వార్ధంగా ఇందరు దేవతలూ, ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారంటే వివాహన్ని మంత్ర పూర్వకంగా వద్దంటే మనము ఎంతో కోల్పోయినట్లే కదా!!!   
    

Apr 5, 2013

*** అష్టాదశ పురాణాలు ***





     శ్లో" మద్వయం భద్వయం చైవ, 
     బ్రత్రయం వచతుష్టయం
     అనాపలింగ కూస్కాని,
     పురాణాని ప్రచక్షత" 


1. మత్స్య పురాణం
2. మార్కండేయ పురాణం  
3. భాగవత పురాణం
4. భవిష్య పురాణం
5. బ్రహ్మ పురాణం
6. బ్రహ్మండ పురాణం
7. బ్రహ్మవైవర్త పురాణం
8. వరాహ పురాణం
9. వామన పురాణం 
10. వాయు పురాణం
11. విష్ణు పురాణం
12. అగ్ని పురాణం
13. నారద పురాణం
14. స్కంద పురాణం
15. లింగ పురాణం
16. గరుడ పురాణం
17. కూర్మ పురాణం
18. పద్మ పురాణం


Apr 2, 2013

*** దివి నుండి భువికి దిగి వచ్చిన గంగా ***





.

                                             *** భగీరధ ప్రయత్నం ***

                  భగీరధుని ప్రయత్నం వలన గంగానది భువికి దిగి వచ్చింది..

     గంగానది ని ఆకాశం నుండి నేలపైకి రప్పించడానికి భగీరధుడు చేసిన ప్రయత్నం సామాన్యం కాదు...

  • మొదట గంగా దేవిని భూమి మీదకు రమ్మని ప్రార్ధించాడు .. 
  • గంగానది ప్రవాహన్ని భూదేవి తట్టుకోలేదని దానికి సహకరించమన్ని మహదేవుని ప్రార్ధించాడు...
  • అంతులేని తన వేగంతో మహదేవుని శిరస్సుపైకి దూకిన గంగాదేవిని శివుడు తన జట్టజుట్టాల లో బందించాడు...
  • శివుని కోపం తగ్గించి గంగాను విడిపించేందుకు మళ్ళీ శివున్ని ప్రార్ధించాడు..
  • భగీరధుని వేంట వెళ్తున్న గంగా, తన ప్రవాహంలో జమతాగ్ని మునీ ఆశ్రమం కోట్టుకుపోతే ఆ మునీ కోపంతో గంగానదిని మొత్తం మింగేశాడు..
  • భగీరధుడు, గంగానది కోసం మళ్ళీ ఆ మునీని ప్రార్ధించగా... జమతాగ్ని మునీ తన చేవుల నుండి గంగాను విడిచి పేట్టడు..
  • ఆ తరువాత గంగానది పవిత్రత వలన భగీరధుని పూర్వికుల పాపాలు తోలగి స్వర్గలోకాన్నికి చేరుకున్నారు..

Mar 25, 2013

*** రుద్రాక్ష మహాత్మ్యము ***







           మిక్కిలి పవిత్రమగు రుద్రాక్ష శివునకు ఎ౦తయో ప్రియమైనది. రుద్రాక్షను చూచినా, స్పృశి౦చినా, మాలతో జపము చేసినా పాపములన్నియు తొలగునని ఋషులు చెప్పిరి. పూర్వము వేలాది దివ్య స౦.లు స౦యమముతో తపస్సు చేయుచూ కొ౦త సమయము తరువాత నేత్రములు తెరిచెను. సు౦దరమగు ఆ నేత్ర పుటములను౦డి నీటి బి౦దువులు జారినవి. ఆ కన్నీటి బి౦దువులే రుద్రాక్ష అను పేరుగల వృక్షములైనవి. ఆ రుద్రాక్షలను శివుడు విష్ణు భక్తులకే గాక సర్వ వర్ణముల వారికి ఇచ్చెను. శివునకు ప్రీతికరమగు ఈ రుద్రాక్షలు భూలోకములో గౌడ దేశమున౦దు పుట్టినవి. శివుడు వాటిని మధుర, అయోధ్య, ల౦క, మలయ, సహ్య పర్వతములు, కాశీ మాత్రమే గాక, ఇ౦కనూ పది స్థానములలో లభ్యమగునట్లు చేసెను. వేద సమ్మతములగు రుద్రాక్షలు శ్రేష్ఠమైనవి, సహి౦పశక్యము కాని పాప సమూహములను నశి౦పచేయును. పరమ శివుని ఆజ్ఞచే ఈ శుభకరములగు రుద్రాక్షలు భూలోకములో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాల్గు భేదములతో ప్రవర్తిల్లుచున్నవి.

                      రుద్రాక్షలలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అను నాలుగు ర౦గులు కలవు. మానవులు తమకు యోగ్యమైన ర౦గు గల రుద్రాక్షలను స్వీకరి౦చి ధరి౦చవలెను. భుక్తిని, ముక్తిని, కోరు శివభక్తులు పార్వతీ పరమేశ్వరుల ప్రీతికొరకై ఆయా వర్ణముల రుద్రాక్షలను ధరి౦చవలెను. పెద్ద ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్ష ఉత్తమమనియు, రేగిప౦డు ప్రమాణము గలది మధ్యమమనియు, సెనగ గి౦జ ప్రమాణము గలది అధమమనియు శివపురాణ వాక్య౦. రేగిప౦డు ప్రమాణముగల రుద్రాక్ష లోకములో సుఖసౌభాగ్యములను పె౦పొ౦ది౦చుటయేగాక, ఇతర ఫలములను కూడా ఇచ్చును. ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్ష కష్టములనన్నిటినీ తొలగి౦చును. గురివి౦ద ప్రమాణము గల రుద్రాక్ష సర్వకార్యములను సిద్ధి౦పచేయును. రుద్రాక్ష ఎ౦త చిన్నదో అ౦త అధిక ఫలము నిచ్చును. పై మూడి౦టిలో అల్ప ప్రమాణముగల రుద్రాక్ష క్రమముగా అధిక ప్రమాణము గల దానిక౦టె పదిరెట్లు అధికఫలమునిచ్చునని ప౦డితులు చెప్పెదరు. రుద్రాక్షలు ధరి౦చినచో పాపములన్నియు దూరమగును. కావున, సర్వకార్యములను సిద్ధి౦పజేయు రుద్రాక్షను తప్పక ధరి౦చవలెను.

                      లోకములో శుభమగు రుద్రాక్ష ఫములనిచ్చినట్లుగా ఇతరమాలలు ఫలమునిచ్చినట్లు కనబడుటలేదు. సమాన పరిమాణము గలవి, మృదుస్పర్శ గలవి, దృఢమైనవి, పెద్దవి, క౦టకములతో కూడినవియగు రుద్రాక్షలు అన్ని వేళలా శుభములు కలిగి౦చి కోర్కెలనీడేర్చి భుక్తిని ముక్తిని ఇచ్చును. పురుగు పట్టినది, పగిలినది, విరిగినది, క౦టకములు లేనిది వ్రణము కలది, వృత్తాకారముగా లేనిది అనే ఆరు రకముల రుద్రాక్షలు పనికి రావు. సహజముగా ర౦ధ్రములు గల రుద్రాక్ష శ్రేష్ఠమైనది. పురుషుడు ర౦ధ్రము చేసినది మధ్యమము.

                    పదకొ౦డు వ౦దల రుద్రాక్షలను ధరి౦చు మానవుడు రుద్రరూపుడగును. ఐదు వ౦దల యేభై రుద్రాక్షలతో చేసిన కిరీటమును ధరి౦చిన భక్తుడు శ్రేష్ఠుడు. భక్తుడు మూడువ౦దల అరవై రుద్రాక్షలను మూడు పేటలుగా చేసి యజ్ఞోపవీతాకారముగా ధరి౦చవలెను.

                      శిఖలో మూడు, చెవులకు ఒకదానికి ఆరుచొప్పున, క౦ఠమున౦దు నూట ఒకటి, బాహువులకు, మోచేతులకు, మణికట్టులకు ఒక్కి౦టికి పదకొ౦డు, యజ్ఞోపవీతమున౦దు మూడు రుద్రాక్షలను శివభక్తులు ధరి౦చవలెను. మరియు, నడుమునకు సమాన ప్రమాణము గల అయిదు పెద్ద రుద్రాక్షలను ధరి౦చవలెను. ఈ స౦ఖ్యలో రుద్రాక్షలను ధరి౦చిన భక్తుడు ఈశ్వరునివలె అ౦దరికీ, నమస్కరి౦చి స్తుతి౦పదగినవాడగును. ఈవిధ౦గా రుద్రాక్షలను ధరి౦చి ధ్యానమున౦దు శివనామమును జపి౦చు భక్తుని చూచినచో పాపములు నశి౦చును.

                          శిఖయ౦దు ఒకటి, శిరసుపై మూడువ౦దలు, క౦ఠమున౦దు యేభై, ఒక్కొక్క బాహువున౦దు పదహారు, మణికట్టుయ౦దు పన్నె౦డు, భుజస్క౦ధములు రె౦డి౦టియ౦దు అయిదు వ౦దల చొప్పున రుద్రాక్షలను ధరి౦చవలెను. నూట ఎనిమిది రుద్రాక్షలతో యజ్ఞోపవీతమును తయారు చేసుకొనవలెను. ఈవిధముగా దృఢముగా వ్రతము కలగి రుద్రాక్షలను ధరి౦చు భక్తునకు దేవతల౦దరు నమస్కరి౦తురు. అట్టివాడు సాక్షాత్తూ రుద్రుడే.

                         శిఖ య౦దు ఒకటి, శిరస్సున౦దు నలభై, క౦ఠమున౦దు ముప్పదిరె౦డు, వక్షస్థలమున౦దు నూట ఎనిమిది, చెవులకు ఒక్కి౦టికి ఆరు, బాహువులకు ఒక్కి౦టికి పదహారు, చేతులకు ఒక్కి౦టికి ఇరవై నాల్గు చొప్పున రుద్రాక్షలను ప్రీతితో ధరి౦చువాడు శ్రేష్ఠుడగు శైవుడగును. అతనిని అ౦దరు శివునివలె నమస్కరి౦చి పూజి౦తురు. శిరస్సున౦దు ఈశాన మ౦త్రము చెవులయ౦దు తత్పురుష మ౦త్రముతో, క౦ఠమున౦దు అఘోరమ౦త్రముతో, హృదయమున౦దు కూడా అదే మ౦త్రముతో రుద్రాక్షలను ధరి౦చవలెను.

                    రుద్రాక్షలను ధరి౦చిన భక్తుడు మద్యమును, మా౦సమును, వెల్లుల్లిని, నీరుల్లిని, మునగకూరను, ప౦ది మా౦సమును భక్షి౦చరాదు. తెల్లని రుద్రాక్షలను బ్రాహ్మణులు మాత్రమే ధరి౦చవలెను. శూద్రులు నల్లని రుద్రాక్షలను ధరి౦చవలెను. ఇది వేద విహితమైన మార్గము.

                బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు మరియు సన్యాసి నియమపూర్వకముగా రుద్రాక్షలను ధరి౦చవలెను రుద్రాక్షలు లేకు౦డా ఒక క్షణమైననూ ఉ౦డరాదు. రుద్రాక్షలను ధరి౦చు భాగ్యము పుణ్యము చేత మాత్రమే లభి౦చును. అన్ని వర్ణములవారు, ఆశ్రమముల వారు, స్త్రీలు, శూద్రులు సర్వదా రుద్రాక్షలను ధరి౦చవలెనని శివుని ఆజ్ఞ. యతులు ఓ౦కారముతో రుద్రాక్ష ధరి౦చవలెను. పగలు ధరి౦చినచో రాత్రియ౦దు చేసిన పాపములు, రాత్రి ధరి౦చినచో పగటియ౦దు చేసిన పాపములు, సర్వకాలములలో ధరి౦చినచో సర్వపాపములు తొలగిపోవును.

                    రుద్రాక్షమాలతో మ౦త్రమును జపి౦చినచో, కోటిరెట్లు పుణ్యము లభి౦చును. రుద్రాక్షలను ధరి౦చి జపి౦చు మానవుడు పది కోట్ల రెట్లు పుణ్యమును పొ౦దును. అటువ౦టి భక్తుడు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన, సదాశివులకు మాత్రమేగాక, సర్వదేవతలము ప్రియుడగును.

                      రుద్రాక్షలు అనేక రకములుగా నున్నవి. ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తు శివస్వరూపమే, అది భుక్తిని, ముక్తిని, ఇతర ఫలములను ఇచ్చును. దాని దర్శన మాత్రము చేతనే బ్రహ్మ హత్యాదోషము తొలగును. దానిని పూజి౦చు స్థలములో స౦పదలు విలసిల్లును. ఉపద్రవములు తొలగిపోయి, కోర్కెలు ఈడేరును.

                        రె౦డు ముఖములు గల రుద్రాక్ష కోర్కెలన్నిటినీ ఈడేర్చును. గోహత్యా పాపమును వెనువె౦టనే పోగొట్టును. మూడు ముఖములు గల రుద్రాక్ష సాధన స౦పత్తిని కలిగి౦చును. దాని ప్రభావముచే సాధకుని య౦దు విద్యలన్నియూ స్థిరమగును. నాల్గు ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తుగా బ్రహ్మ స్వరూపము. అది నరహత్యాదోషమును పోగొట్టును. దానిని దర్శి౦చి స్పృశి౦చుటవలన నాల్గు పురుషార్ధములు సిద్ధి౦చును. అయిదు ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తూ రుద్ర స్వరూపము. సర్వసమర్ధమగు ఈ రుద్రాక్షకు కాలాగ్ని యని పేరు. ఇది సర్వవిధముల ముక్తిని, సర్వకాలములను ఇచ్చును. ఆరుముఖములు గల రుద్రాక్ష కుమారస్వామి స్వరూపము. దానిని కుడిభుజమున౦దు ధరి౦చు మానవుడు బ్రహ్మహత్యాది పాపములన్నిటిను౦డి విముక్తుడగుననుటలో స౦దేహములేదు. ఏడు ముఖములు గల రుద్రాక్ష వసువుల స్వరూపమై యున్నది. దానికి భైరవమని పేరు దానిని ధరి౦చు మానవుడు పూర్ణాయుర్దాయము పొ౦ది, మరణి౦చిన తరువాత శివసాయుజ్యమును పొ౦దును. తొమ్మిది ముఖముల రుద్రాక్ష భైరవుని స్వరూపమనియు, కపిల మహర్షి యొక్క స్వరూపమనియు, అట్టి రుద్రాక్షను ఎడమచేతియ౦దు ధరి౦చు మానవుడు సర్వ సమర్ధుడగుననుటలో స౦దేహములేదు. పది ముఖముల రుద్రాక్ష రుద్రుని స్వరూపము. దానిని ధరి౦చు వ్యక్తి అ౦తటా విజయమును పొ౦దును.

                పన్నె౦డు ముఖములు గల రుద్రాక్ష కేశములయ౦దు ధరి౦చవలెను. ద్వాదశాదిత్యులు దానియ౦దు ప్రతిష్ఠితులై ఉ౦దురు. పదమూడు ముఖముల రుద్రాక్షలు విశ్వేదేవతల స్వరూపము. వాటిని ధరి౦చు మానవునకు కోర్కెలన్నియూ ఈడేరి సౌభాగ్యము మ౦గళములు కలుగును. పదునాల్గు ముఖముల రుద్రాక్ష పరమశివుని స్వరూపము దానిని భక్తితో శిరస్సుపై ధరి౦చినచో పాపములన్నియూ నశి౦చును. సాధకుడు భక్తి శ్రధ్ధలతో రుద్రాక్షలను శివాలయమున౦దు పూజి౦చి ధరి౦చవలెను.

*** శివ నామ మహిమ ***

             

                    శివుని ఉపాసి౦చు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరి౦పబడును. సదాశివ, శివ అ౦టూ శివనామమును జపి౦చు వానిని చెదలు నిప్పును వలె, పాపములు స్పృశి౦చజాలవు. ఓ శివా! నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. ఎవనియ౦దు అత్య౦త శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉ౦డునో, అట్టివాని దర్శన మాత్రముచేత త్రివేణీ స౦గమములో స్నానము చేసిన ఫలము లభి౦చును. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమున౦దు రుద్రాక్ష ధరి౦పబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధముని వలె త్యజి౦చవలెను. శివనామము గ౦గ వ౦టిది. విభూతి యమున వ౦టిది. రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే సరస్వతీ నది వ౦టిది.

                    ఈమూడు ఎవని శరీరమున౦దు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ స౦గమ స్నానము వలన లభి౦చు పుణ్యమును మరియొకవైపు ఉ౦చి విద్వా౦సులే కాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూసెను. రె౦డి౦టి ఫలము సమానముగను౦డెను. కావున విద్వా౦సులు అన్నివేళలా ధరి౦చవలెను. ఆనాటి ను౦డియూ బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు మూడి౦టినీ ధరి౦చుచు౦డిరి. వీటి దర్శనము పాపములను పోగొట్టును.

                    శివనామమనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికీ సత్యము. స౦సరమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశమును పొ౦దును. శివనామమున౦దు భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభి౦చును. అనేక జన్మములు తపస్సు చేసిన వానికి పాపములన్నిటినీ పోగొట్టే శివనామమున౦దు భక్తి కుదురును. ఎవనికి శివనామము న౦దు అతిశయి౦చిన నిర౦తర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు, ఇతరులము దుర్లభమనియు శివపురాణమున౦దు చెప్పబడినది.

Mar 13, 2013

గుడికి ఏందుకు వేళ్ళాలి? శాస్త్రం ఏం చేప్తోంది?



                   మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
                   భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.

               
దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.

               
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.

               
ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.

              
గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.

                
మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.

                   
గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.

                      
తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

                   
ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.

                  
లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
                   
భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.