Apr 26, 2013
పెళ్ళికి వచ్చే దేవతలు
పెళ్ళికి వచ్చే దేవతలు
పెళ్ళిలో ప్రధమంగా గణపతి పూజ ప్రారంభమౌతుంది కాబట్టి వినాయకుడు ఆ పెళ్ళి మంటపానికి మొదటగా వస్తాడు. ఆయన తన పూజనందుకొని నిత్యవరుడై నిత్యకళ్యణాన్ని పచ్చతోరణంతో జరుపుకొనే శ్రీ మహావిష్ణువుని ఆయన భార్య శ్రీ మహాలక్ష్మిదేవితో సహా వేదికవద్దకి పంపించి మరీ వెళ్తాడు గణపతి. ఆ మహావిష్ణువే సతీసమేతంగా మన పెళ్ళి వేదిక మీద కలశంలో సర్వ వివాహ ధర్మాన్ని గమనిస్తూ వుంటాడు. శ్రీ మహావిష్ణువు సతీసమేతంగా వస్తూన్నాడనే సమాచారాన్ని ముందుగా గరుడుడు దేవతలందరికీ తెలియజేస్తాడు. దాంతో శ్రీ మహావిష్ణువుకి స్వాగతం పలికేందుకు విష్ణువు రాకకి ముందే పెళ్ళివేదిక వద్దకు అష్టదిక్పాలకులూ - అంటే ఎనిమిది దిక్కుల్నీ పరిపాలించే ఇంద్రుడు (తూర్పు), అగ్ని (ఆగ్నేయం), యముడు (దక్షిణం), నిరృతి (నైఋతి), వరుణుడు (పశ్చిమం), వాయువు (వాయువ్యం), కుబేరుడు (ఉత్తరం), ఈశానుడు (ఈశాన్యం) వీరందరూ వివాహవేదిక వద్దకు చేరుకుంటారు. వీరితోపాటు వీరి దాసులు, దాసానుదాసులు, భక్తులు, వైకుంఠ కైలాస నివాసులు అంతా అక్కడికి రానేవస్తారు. వారు వారి ధర్మపత్ని సమేతంగా అనగా వశిష్ఠ-అత్రి - భరద్వాజ- విశ్వామిత్ర- గౌతమ-కశ్యప-జమదగ్ని మొదలగు సప్తమహర్షులు వచ్చి ఆ నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. శాస్తోక్తమైన మంత్ర పూరక వివాహనికి నిస్వార్ధంగా ఇందరు దేవతలూ, ఋషులు వచ్చి ఆశీర్వదిస్తారంటే వివాహన్ని మంత్ర పూర్వకంగా వద్దంటే మనము ఎంతో కోల్పోయినట్లే కదా!!!
Apr 5, 2013
*** అష్టాదశ పురాణాలు ***
శ్లో" మద్వయం భద్వయం చైవ,
బ్రత్రయం వచతుష్టయం
అనాపలింగ కూస్కాని,
పురాణాని ప్రచక్షత"
1. మత్స్య పురాణం
2. మార్కండేయ పురాణం
3. భాగవత పురాణం
4. భవిష్య పురాణం
5. బ్రహ్మ పురాణం
6. బ్రహ్మండ పురాణం
7. బ్రహ్మవైవర్త పురాణం
8. వరాహ పురాణం
9. వామన పురాణం
11. విష్ణు పురాణం
12. అగ్ని పురాణం
13. నారద పురాణం
14. స్కంద పురాణం
15. లింగ పురాణం
16. గరుడ పురాణం
17. కూర్మ పురాణం
18. పద్మ పురాణం
Apr 2, 2013
*** దివి నుండి భువికి దిగి వచ్చిన గంగా ***
.
*** భగీరధ ప్రయత్నం ***
భగీరధుని ప్రయత్నం వలన గంగానది భువికి దిగి వచ్చింది..
గంగానది ని ఆకాశం నుండి నేలపైకి రప్పించడానికి భగీరధుడు చేసిన ప్రయత్నం సామాన్యం కాదు...
- మొదట గంగా దేవిని భూమి మీదకు రమ్మని ప్రార్ధించాడు ..
- గంగానది ప్రవాహన్ని భూదేవి తట్టుకోలేదని దానికి సహకరించమన్ని మహదేవుని ప్రార్ధించాడు...
- అంతులేని తన వేగంతో మహదేవుని శిరస్సుపైకి దూకిన గంగాదేవిని శివుడు తన జట్టజుట్టాల లో బందించాడు...
- శివుని కోపం తగ్గించి గంగాను విడిపించేందుకు మళ్ళీ శివున్ని ప్రార్ధించాడు..
- భగీరధుని వేంట వెళ్తున్న గంగా, తన ప్రవాహంలో జమతాగ్ని మునీ ఆశ్రమం కోట్టుకుపోతే ఆ మునీ కోపంతో గంగానదిని మొత్తం మింగేశాడు..
- భగీరధుడు, గంగానది కోసం మళ్ళీ ఆ మునీని ప్రార్ధించగా... జమతాగ్ని మునీ తన చేవుల నుండి గంగాను విడిచి పేట్టడు..
- ఆ తరువాత గంగానది పవిత్రత వలన భగీరధుని పూర్వికుల పాపాలు తోలగి స్వర్గలోకాన్నికి చేరుకున్నారు..
Subscribe to:
Posts (Atom)